కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 10,000 (Tamil Nadu Surpass 10,000 COVID-19 deaths)కు చేరుకుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
టీనేజీ యువతిని ఎమ్మెల్యే ప్రేమ వివాహం (MLA Love Marriage) చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతుంది. తాజాగా తమిళ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్కు కరోనా పాజిటివ్ (Vijayakanth Tests Positive for COVID19) అని నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
‘హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని బ్యాంకు మేనేజర్ చేసిన కామెంట్స్ దక్షిణాదిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.
Explosion in a firecracker factory | విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మరణించారు. దీపావళి పండుగకు బాణాసంచా తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ప్రపంచమంతా కరోనావైరస్ (, Coronavirus) వినాశనం సృష్టిస్తోంది. ఆరు నెలల నుంచి కోవిడ్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కరోనా భయంతో పక్కవారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఎందుకంటే.. కరోనా ఎవరికీ ఉందో ఎవరికీ లేదో మనకెవరికీ తెలియదు. ఈ క్రమంలో వ్యాపారలావాదేవీల పరిస్థితి మరి దారుణంగా మారింది.
భారత మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ( Vijay Shankar ) గురువారం సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు.
తమిళనాడు (tamil nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారు.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు.
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.
Golden masks, silver masks: కోయంబత్తూరు: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులా !! అదేంటి మాస్క్ అంటే కేవలం వైరస్ నుంచి రక్షణ కోసం ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకునే వస్త్రం మాత్రమే కదా !! ఇంక ఇందులోనూ గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులు ఉంటాయా ఏంటి అని అనుకుంటున్నారా ?
తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’ (custodial death case) కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో సీబీ-సీఐడీ అధికారులు మరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని, ఇక లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.