గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీలో రాజకీయ వేడి రాజుకుంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, నరసారావు పేట ఎంపీల మధ్య భగ్గుమన్న విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
రాష్ట్రాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చని, అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే రాష్ట్రానికే ప్రమాదమని అలాంటి కోరికలు నాకు లేవని, టీఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సులో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య సయోధ్య నెలకొందని, వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ స్పష్టతనిచ్చారు.
తెల్ల రేషన్ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు.
వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు మా పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడు మితున్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలు దేశంలోని మైనారిటీలలో అభద్రతను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పిఆర్లో అడిగే సమాచారం గతానికి, ఇప్పుడున్న చట్టంలో భిన్నంగా ఉందని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, న్యాయ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపింది.
Yanamala Rama Krishnudu | శాసనమండలిని రద్దు చేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉందని, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్క రాజధాని చాలు అని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. శానస మండలిలో ఏపీ రాజధానుల బిల్లు వచ్చిన రోజే ఆయన రాజీనామా చేయడం టీడీపీకి ప్రతికూలాంశంగా మారనుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. మొత్తం రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని సమన్లలో సూచించింది.
పాకిస్తాన్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను బీఎస్ఎఫ్కు అప్పగించారు. ఏపీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆ జాలర్లకు స్వాగతం పలికారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీపై రంగు చల్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.