తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రజా ప్రతినిధులలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం.
సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు సీఎం క్యాంపు కార్యాలయంలో (YSR Kapu Nestham) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. నేడు వారి ఖాతాల్లోకి రూ.24వేలు జమ కానున్నాయి. YSR Nethanna Nestham
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్తో యుద్ధం చేసుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా టీడీపీ, వైసీపీల మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ విప్ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ..
విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడిలో స్థానిక వైసీపీ నేతపై కత్తులతో దాడి జరిగింది( Attack on YSRCP leader). వైఎస్సార్సీపీ నేత, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
జేసీ దివాకర్ రెడ్డికి ( JC Diwakar Reddy ) షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇదివరకే ఏపీ రవాణా శాఖ అధికారులు జరిపిన దాడుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిలకు ( JC Prabhakar Reddy ) చెందిన దివాకర్ ట్రావెల్స్ ( Diwakar Travels ) బస్సులలో అనుమతి లేకుండా నడుస్తూ పట్టుబడిన వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
జగన్ అనే నేను..!! అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్ 2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.