Pawan Kalyan comments on CM post: తిరుపతి: తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. సీఎం కాకపోయినా సేవ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం అయితేనే అని కాదు.. కాకపోయినా సరే ఇంకా ఎక్కువ సేవే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సామాన్యులపై అధికార పార్టీ (YSRCP) ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు.
TDP Boycott Election: బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టీడీపీ బహిష్కరిస్తున్నట్లు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
YSRCP MLA Venkata Subbaiah Passed Away : గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సుబ్బయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు
Election Code In AP 2021: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఒక ప్రకటన జారీ చేశారు.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
Tadipatri Municipal Chairman Election Updates: ఏపీ ప్రజలు సైతం అధికార వికేంద్రీకరణకు ఓటు వేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలిపారు. అనంతరంపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలు మినహా అన్ని మున్సిపాలిటీలలోనూ వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించింది.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
YSRCP In Municipal Elections 2021 Results: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ దిశగా వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్సీపీ రిపీట్ చేస్తోంది.
YS Jagan On YSRCP Formation Day: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఆయన శ్రమకు తగ్గ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.
Nimmada Election Results 2021: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. అధికార YSRCPకి ప్రతిపక్ష టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబం షాకిచ్చింది.
E-Netram App: AP Panchayat Elections 2021 | ఏపీ ఎలక్షన్ ఈ వాచ్ యాప్నకు పోటీగా వైఎస్సార్సీపీ మరో ప్రత్యేక యాప్ను అదేరోజు లాంచ్ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఈ నేత్రం(E-Netram App) పేరుతో మరో ఎలక్షన్ యాప్ తీసుకొచ్చింది.
IPS RP Thakur Appointed As MD Of APSRTC: ఏపీ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ మేరకు ఠాకూర్కు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్కు సమన్లు జారీచేసింది.
AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.