ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao Murder) హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) జైలు నుంచి విడుదలయ్యారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు (ఎంపీ), ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkata Ramana) కారు ప్రమాదానికి గురైంది. విశాఖలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్లో ప్రమాదం జరిగి వాహనాలన్నీ స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా ( Khaleel Basha ) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Medical Posts In Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో.. థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో కమెడియన్ పృథ్వీ రాజ్ (Pruthvi Raj) ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్గా, నటుడిగా గుర్తింపు పొందారు.
ఏపిలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం లక్షకన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పదిలక్షల కన్నా ఎక్కువ కోవిడ్-19 పరీక్షలు (Covid-19 ) నిర్వహించారు. కరోనావైరస్ ధాటికి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు చాలా మంది ప్రభావితం అవుతున్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో ( Kollu Ravindra's bail plea) చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జిల్లా కోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టిపారేసింది.
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు ( Ambati Rambabu ) కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తన ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆందోళన చెందుతున్న వారికి సమాధానం చెబుతూ అంబటి రాంబాబు నేరుగా ఓ వీడియో విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Andhra Pradesh cm ys jagan ) ప్రతిపక్షం తెలుగుదేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంక్షేమ పధకాల్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న దౌర్భాగ్య రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయని సీఎం జగన్ దుయ్యబట్టారు. పేదలకు అందాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో కూడా కోర్డు మెట్లెక్కి అడ్డుకుంటోందని జగన్ స్పష్టం చేశారు.
AP Cabinet Expansion | సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.
ఏపీలో మరో ఎమ్మెల్యే ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలో రెండుసార్లు పరీక్షలు చేపించుకుంటే నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం జలుబు రావడంతో మరోసారి టెస్టులు చేపించగా ఫలితాలలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే శివకుమార్ (Annabathuni Siva Kumar Tests Positive For CoronaVirus).
చాలామంది హీరోలు, హీరోయిన్లకు ఎదురైన సమస్యే ఇప్పుడు కమెడియన్ ఆలీకి కూడా ఎదురైంది. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ట్విటర్లో ఫేక్ అకౌంట్ను ఏర్పాటు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆలీ శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Raghu Rama Krishnam Raju letter to PM Modi | సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నేతలను ఇరుకున పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. పార్టీతో సంప్రదింపులు జరపకుండా ఆయన లేఖలు రాయడంపై వైసీసీ నేతలు పెదవి విరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. సామాన్య ప్రజల నుంచి, నాయకులు, ప్రజాప్రతినిధుల వరకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అధికార పార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనావైరస్ సోకింది.
YSRCP Leader Moka Bhaskar Rao | కృష్ణా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ నేత, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.