RGV: ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.
Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
Badvel bypoll latest updates: బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dasari Sudha), బీజేపీ అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.
Chandrababus residence : మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం సమీపంలో నిరసన చేపట్టారు.
Vizag Steel Plant Issue: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా జరుగుతున్న ఉద్యమం ఇకపై మరింత ఉధృతం కానుంది. స్టీల్ప్లాంట్ ఉద్యమాన్నిత మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి వెల్లడించింది.
Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
YSRCP MP Vijayasai Reddy about Anandaiah mandu: విశాఖపట్నం: ఆనందయ్య మందుపై వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. కరోనాకు ఆయుర్వేద చికిత్సలో భాగంగా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషదంతో (Krishnapatnam ayurvedic medicine) ఎలాంటి ఇబ్బంది లేదని విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు.
YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల (Pelli Kanuka scheme, Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయం పెంపుపై ఇచ్చిన హామీ గురించి తన లేఖలో ప్రస్తావించారు.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Nara Lokesh booked in Criminal case: అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అనంతపురం జిల్లా రాయదుర్గ్ నియోజకవర్గం పరిధిలోని డి హిరేహాల్ పోలీసు స్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నారా లోకేష్పై (FIR filed on Nara Lokesh) కేసు నమోదు చేశారు.
Tirupati Bypoll Results Live Updates: ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఊహించినట్టే అధికార పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టే భారీ మెజార్టీ సాధించబోతుందా..
Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటివరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. చివర్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్తో బాధపడుతున్న పేషంట్స్కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
AP High Court : గతంలో విడుదలైన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ నూతన ఎస్ఈసీ ముందుకు వెళ్లడం, ఎన్నికలు కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, బీజేపీ మరియు జనసేన పార్టీలు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.