IND vs ENG: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
T20 World Cup 2021: వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్లను ప్రకటిస్తూ మెగాటోర్నీకి తాము సిద్ధమని ప్రకటిస్తున్నాయి పలు దేశాలు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించింది.
IND Vs ENG 4th Test: ఇంగ్లాండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం లభించింది. పంత్, శార్దుల్ అర్ధ సెంచరీలతో రాణించటంతో...భారత్ రెండో ఇన్నింగ్స్లో 466 పరుగులు చేసింది. దీంతో 367 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత్.
Ind Vs Eng : టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్లో ఉంచారు.
Vasoo Paranjape: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే(82) సోమవారం కన్నుమూశారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పించారు.
INDvsENG 3rd Test: మూడో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలిరోజు తమ బౌలింగ్ తో భారత్ ను దెబ్బ దీసిన అతిథ్య జట్టు..రెండో రోజు బ్యాటింగ్ లో సత్తా చాటింది. సారథి రూట్ మరోసారి శతకంతో మెరిశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఏ మేరకు పోరాడతుందో వేచి చూడాలి.
Ind Vs Eng: టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ, రహానే మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
India vs Eng 3rd Test: లార్డ్స్ లో విజయం తర్వాత ఇంగ్లాండ్ తో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Afghanistan: అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోవటంతో....ఆ దేశ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించనవి విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ కు మద్దతుగా నిలిచి ప్రపంచం మెుత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.
Australia team for T20 World Cup 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లలో టీ20 స్పెషలిస్టులుగా పేరున్న మార్కస్ స్టొయినిస్, కేన్ రిచర్డ్సన్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. యూఏఈ, ఒమన్లో జరగనున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న (T20 World Cup 2021 schedule) ముగియనుంది.
ICC T20 World Cup: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్తో పాటు యూఏఈలో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్లో క్రికెట్తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Attack on KL Rahul during IND vs ENG 2nd test match: కె.ఎల్. రాహుల్ ఫీల్డింగ్ చేస్తున్న చోట అతడి చుట్టు పక్కల శాంపేన్ కార్క్స్, విస్కీ బాటిల్ మూతలు (champagne corks, Whiskey bottle's corks) పడి ఉండటం ఆ ఫోటోల్లో, వీడియోల్లో చూడవచ్చు.
Cricket In Olympics: అంతా సజావుగా సాగితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో మనం క్రికెట్ను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఐసీసీ.. ఒలింపిక్స్లో క్రికెట్ ను చేర్చేందుకు బిడ్ వేయనుంది.
Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
Ashwin Yadav dies of heart attack: హైదరాబాద్: మాజీ పేస్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అశ్విన్ యాదవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు పడగొట్టారు.
క్రీడా ప్రపంచంలో ఇప్పుడు మహిళలు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్లో మహిళలు చాలా ప్రగతి సాధించారు. మహిళల క్రికెట్ మాత్రమే కాదు..ఆ మహిళల అందం కూడా చర్చనీయాంశమవుతోంది. తమకిష్టమైన మహిళా క్రికెటర్లను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువే. మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా
India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.