Ind Vs Eng : టీమిండియాకు షాక్..హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్..మరో ముగ్గురు సభ్యులు కూడా..!

Ind Vs Eng : టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్​గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్​లో ఉంచారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2021, 06:40 PM IST
  • రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
  • అతనితో పాటు కోచింగ్ స్టాఫ్‌ కూడా ఐసోలేషన్‌లో
  • ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆడుతున్న టీమిండియా
Ind Vs Eng : టీమిండియాకు షాక్..హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్..మరో ముగ్గురు సభ్యులు కూడా..!

Ind Vs Eng : ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri)కి కరోనా పాజిటివ్‌(Corona Positive)గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI Secretary Jai Shah) వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రి(Ravi Shastri)తో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. 

ఈ వార్త వినగానే టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్‌(Ind vs Eng 4th test)లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ న్యూస్ టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ టెస్ట్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)ఉన్నారు. 

Also Read: Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన కృష్ణ నగార్

వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్‌(India) 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్‌) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌(India First innigs)లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News