Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Naidu Speech: పొత్తులు తమ కోసం కాదని.. ఏపీ రాష్ట్ర రక్షణ కోసమేనని టీడీపీ అధినేత తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తమ ఆరాటమని ప్రకటించారు. పెనుకొండ సభలో...
Andhra Pradesh Elections: ఆంధ్ర ప్రదేశ్ లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమిఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్లు చేశారు.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
Ex IAS Officer Vijay Kumar: ఇప్పటికే రాజకీయాలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరేంటి? ఎవరు స్థాపించారు? ఆ పార్టీ లక్ష్యాలేమిటో అనేవి ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
AP Assembly Elections: ఎన్నికల సమయం దూసుకొస్తుండడం.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్తుండడంతో తెలుగుదేశం, జనసేన ఇప్పుడు సీట్ల పంపకాలపై సమావేశమైంది. పార్టీ అధినేతల భేటీలో జరిగిన చర్చల్లో సీట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. పరిణామాలు చూస్తుంటే వారి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.
YSRCP Candidates List: రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థులను మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా మార్పుచేసిన వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. వీటిలో కీలకమైన మార్పులు చేసింది.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
AP Assembly Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ సమరం కూడా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఏపీ ఎన్నికల విషయమై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ కలుగుతోంది. మరోసారి వైఎస్ జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా.. మూకుమ్మడిగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే విడుదలైంది.
YSRCP 5th List: ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులను కొనసాగిస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలుగా మార్పులు చేసిన అధికార పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ ఇన్చార్జీలను మార్చేసింది.
All Eyes on Cabinet Meeting: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా.. ప్రజలకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.