Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని ఆమె తెలిపారు. టెక్కలి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
Chandrababu On CM Jagan: జగన్ ఒక్క ఛాన్స్ అంటూ.. పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ను ఇంటికి పంపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగ అంటూ విమర్శించారు.
AP Govt Approves Two DAs: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
CM Jagan With India Today: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఇండియా టుడే సదస్సులో అన్నారు.
Chandrababu Naidu on CM Jagan: సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యపై మాట్లాడే దమ్ము సీఎం జగన్కు ఉందా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్కు బాబాయ్ ప్రాణాలే లెక్కలేదని.. ఇక మనం ఓ లెక్కా అని అన్నారు. కడప జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.
CM Jagan with YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం వేడుక గోల్కొండ రిసార్ట్స్లో ఘనంగా జరిగింది. మేనల్లుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థం వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు హాజరై.. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులు సందడి చేశారు.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో మరింత దూకుడుగా వ్యహరిస్తోంది. ఇప్పటికే మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఇంఛార్జ్ల లిస్ట్ను రిలీజ్ చేసింది. పలుచోట్ల సిట్టింగ్లను మార్చింది.
Narreddy Sunitha Reddy: ఒక గట్టున అన్నయ్య .. మరో గట్టున చెల్లెళ్లు .. వెరసి ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్లు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ ఒకప్పుడు వదిలిన బాణం ఇప్పుడు తిరగబడగా.. అదే బాటలో మరో చెల్లెలు రంగంలోకి దిగబోతున్నారు. దీంతో ఒక అన్న .. ఇద్దరు చెల్లెళ్ల రాజకీయ పోరాటం ఏ మలుపు తిరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.