ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి అన్నారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షకు దిగుతున్నారని.. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం మన్య ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించారు. అరకు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరపగా...ఆయన అక్కడిక్కడే మరణించారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం గాజువాకలో శ్రీ కన్య సినిమా హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్పై భాగంలో ఉన్న సెల్ టవర్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.