ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Dronamraju Srinivas Dies | వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
COVID-19 vaccine clinical trials in Vizag విశాఖ: కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు ఆంధ్రా మెడికల్ కాలేజీ ( AMC ), కింగ్ జార్జ్ హాస్పిటల్స్ ( KGH )లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
fire accident at Vizag port | గత కొన్ని రోజులుగా ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ పోర్టు ట్రస్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్లో ఓ నౌక ఇంజిన్ నుంచి పోగలు వచ్చాయి.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
Visakhapatnam crane tragedy వైజాగ్: విశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం క్రేన్ను రోజువారి విధులలో భాగంగా చెక్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నం: పామును.. చూడగానే ఆమడ దూరం పరుగెడతాం. ఇది సహజం. మరి ఆ పాము చాలా పెద్దగా ఉంటే.. గుండెలు గుభేల్ మంటాయి. అలాంటి పామును చంపకుండా జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
ఎల్జీ పాలిమర్స్ కు ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇటీవలే స్టెరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు.
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
Vizag gas leak tragedy విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, తదితర టాలీవుడ్ ప్రముఖులు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి విష వాయువు విడుదల కావడంతో విశాఖపట్నంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకేజ్ ( Chemical gas leakage ) అయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. విషవాయువు చుట్టుముట్టడంతో ఊపిరాడక వందల మంది జనం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
గోపాలపట్నం పరిధిలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం వేకువ జామున ఈ విష వాయువులు (Visakha Gas Leakage) లీకైనట్లు సమాచారం. ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.