AP: వైఎస్ జగన్ సరికొత్త ఆలోచన, విశాఖకు గోదావరి నీరు

వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

Last Updated : Nov 13, 2020, 02:27 PM IST
  • విశాఖపట్నంకు ఇకపై తాగునీటి సమస్య దూరం కానుంది
  • 220 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం ద్వారా విశాఖపట్నంకు తాగునీరు సరఫరా
  • 4 వేల 460 కోట్ల ఖర్చుతో త్వరలో సిద్ధం కానున్న డీపీఆర్
AP: వైఎస్ జగన్ సరికొత్త ఆలోచన, విశాఖకు గోదావరి నీరు

వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం ( Visakhapatnam )లో ఇకపై తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి ఉండదు. అందుకే విశాఖపట్నం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. గోదావరి జలాల్ని విశాఖకు తరలించి..తాగునీటి సమస్యను దూరం చేయడమే ఈ ప్రణాళిక. 

గోదావరి నీటిని ( Godavari water to Visakha ) విశాఖకు అందించడం అంత సులభమేం కాదు. 220 కిలోమీటర్ల దూరం గోదావరి జలాల్ని తరలించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) ప్రాంతం నుంచి విశాఖపట్నంకు 220 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన.  దీని కోసం 4 వేల 660 కోట్ల ఖర్చవుతుందనేది ప్రాధమిక అంచనా. డీపీఆర్( DPR ) తయారీకు కార్యాచరణ సిద్ధమవుతోంది. 

ప్రస్తుతం తాగునీటి కోసం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( GVMC ) ఏడాదికి 120 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ( Water Pipeline project ) పూర్తయితే..జీవీఎంసీకు ఏడాదికి 50-60 కోట్లు ఆదా అవుతాయి. పైప్ లైన్ ద్వారా తరలించే నీటిని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ లో స్టోర్ చేయాలనేది ఆలోచన. భౌగోళిక పరిస్థితుల్ని బట్టి 2.2  నుంచి 2.5 మీటర్ల వ్యాసార్ధమున్న పైపుల్ని అమర్చుతారు. అవసరమైన చోట పంపుసెట్లు, సంప్ ల నిర్మాణముంటుంది. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 12 టీఎంసీల నీటిని పైప్ లైన్ ద్వారా తరలించాలనేది ప్రతిపాదనగా ఉంది. 

ఈ పైప్ లైన్ ద్వారా విశాఖతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, తుని ప్రాంతాలకు కూడా తాగునీరు అందించనున్నారు. భవిష్యత్ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. Also read: AP: ఆ టీడీపీ నేత ఎగ్గొట్టిన రుణం ఎంతో తెలుసా..ఇప్పుడా ఆస్థులు వేలం

Trending News