Cm KCR Silence: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు మౌనంగా ఉంటుండగా.. బీజేపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.
Rahul Gandhi in TS: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో మూడు రోజుల బ్రేక్ అనంతరం ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ చివరి వరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు
YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు.
Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సింహయాజీ స్వామీజీ లీలలు వెలుగుచూస్తున్నాయి. 5 నెలల్నించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. పలువురు సినీ ప్రముఖులతో కూడా స్వామీజీ భేటీ అయినట్టు తెలుస్తోంది.
TRS MLAs Case: ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపి ప్రయత్నించిందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TRS MLA Rohit Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపిలో చేర్చుకునే పథకంలో భాగంగా వారితో ఒక ఒప్పందానికి వచ్చేందుకు ముగ్గురు ఏజెంట్స్ కలిసినట్టు రోహిత్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి స్పీచ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Counter To TRS: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. ఓ వైపు మునుగోడు ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది.
BJP Deal With TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆరోపించారు.
BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులను బీజేపి కొనుగోలు చేయాలని కుట్ర పన్నిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Talasani Srinivas Yadav : విపక్షాల మాటలను, డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లోరైడ్ సమస్య మీద విపక్షాలు చెబుతున్న మాటల మీద తలసాని కౌంటర్లు వేశారు.
MLC Jeevan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తేనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? అంటూ చురకలు అంటించారు.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Munugode bypolls campaigns: మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ప్రతీకార జ్వాలలు రాజుకుంటున్నాయి. అభ్యర్థుల అనుచరులు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు.
Munugode Bypoll : మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.