TDP Launches Nalugella Narakam To Defeat YSRCP: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో కొత్త జోష్ నింపుకున్న టీడీపీ.. తాజాగా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే కసితో ఉన్న తెలుగు దేశం పార్టీ తాజాగా 'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో ఒక కొత్త తరహా పొలిటికల్ క్యాంపెయిన్ కి రంగం సిద్ధం చేసింది.
గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రాజోలులో నేడు జనసేన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్పై విరుచుకుపడ్డారు. జనసేన ఓట్ల నుంచి గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
Rajampeta Politics in AP: కొత్తగా ఏర్పడిన జిల్లాకు కేంద్రం అవుతుందనుకున్న ఆ నియోజకవర్గానికి మొండి చేయి దక్కింది. అధికార పార్టీకి బలం ఉన్నా నేతల మధ్య అనైక్యత, వర్గ విభేదాలు అక్కడ వైసిపికి మైనస్ గా మారుతున్నాయి. జనంలో పార్టీని పలుచన చేసేలా అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యవహరించడం సమస్యలను మరింత జఠిలం చేస్తోంది.
Telangana Politics: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది.దీంతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తోంది కేసీఆర్ సర్కార్. నాలుగున్నరేళ్లు నాన్చి... ఎట్టకేలకు కొల్లూరులో డబుల్ ఇండ్లను ప్రారంభిస్తున్నారు.
Khammam Politics: కాంగ్రెస్ లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించింది టీపీసీసీ. కాగా .. మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు.
Ambati Rambabu Comments on Pawan Kalyan: మరో 9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కోబోతున్నామో తమకు సరైన స్పష్టత ఉంది అని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో పాటు దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నాము. జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు.
khammam politics: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవ్వటంతో వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముందుగా అత్తాపూర్ లోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి పొంగులేటితో భేటీ అవుతున్నారు.
khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది.
Pawan Kalyan Visits Yetimoga oF Kakinada: 'దానశీలి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ వారసులు మీరు.. తన, మన బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి తరాల సంపద మీరు.. ప్రభుత్వం విదిలించే అరకొర సాయానికి దేహీ అనాల్సిన పని మీకు లేదు. మీరు పది మందికీ మత్స్యసంపదను పంచే సంపద సృష్టికర్తలు. మీరంతా స్వయంశక్తి సాధించే దిశగా పుట్టిందే జనసేన షణ్ముఖ వ్యూహం.. ప్రతి మత్స్యకారుడు ఆర్థికాభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
AP Assembly Elections 2023: ఏపీలో తెలుగు దేశం పార్టీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డం పడుతున్నారా ? పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన వాళ్లే.. పార్టీని దెబ్బ తీస్తున్నారా ? అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి ? టీడీపీని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి ?
AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
Ganta Narahari Prifile: ఆ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఈ లోక్ సభ స్థానంలో రెండే సార్లు గెలిచింది. మరో రెండు సార్లు పొత్తులో బాగంగా పోటీ నుంచి తప్పుకుంది. పదేళ్లుగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా టిడిపి నుండి ఎవరూ పోటీలో లేరు... ఇప్పుడు ఆ పార్టీ తమ పార్టీ తరపున కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా అభ్యర్థి, ఏమా కథ ?
Kuppam Politics: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
Eggs Pelted at Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్పై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.