Minister Roja Counter Pawan Kalyan and Chandrababu: రజనీకాంత్ తరహాలో డైలాగ్ చెప్పి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేశ్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్, చంద్రబాబులకు విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని సీఎం జగన్ను కోరారు.
Bandi Sanjay Fires on AP Govt: సీఎం జగన్ సర్కారుపై బండి సంజయ్ ఓ రేంజ్లో విచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని అన్నారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
Balineni Srinivasa Reddy: ఒంగోలు అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఇళ్ల పట్టాలపై విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు నిరూపించకపోతే వాళ్లు రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.
జగన్ వల్లే రాజధాని రైతులను తాను మోసం చేశానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు క్షమాణలు చెప్పారు. రాక్షస పాలన పోవాలి.. అమరావతి రాజధానిగా రావాలి అని నినాదించారు. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు డబ్బులు జమకానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
CM Jagan Review Meeting: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు సీఎం జగన్. వివిధ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
CM Jagan Review Meeting on Rains: పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయాలని చెప్పారు. కచ్చ ఇళ్లలో ఉన్న వారికి రూ.10 వేలు అందజేయాలని సూచించారు.
అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్ను ఆవిష్కరించారు.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
Andhra Pradesh IPL Team: ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ తరుఫున ఫ్రాంచైజీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు అనుమతి ఇస్తే.. బిడ్ దాఖలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ హోమ్ గ్రౌండ్గా ఏపీ ఐపీఎల్ టీమ్ను రెడీ చేస్తున్నారు.
Sajjala Ramakrishna Reddy On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు.
CM Jagan Comments On Pawan Kalyan And Chandrababu: పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఒకరు వెన్నుపోటు వీరుడు అని.. మరొకరుడు ప్యాకేజీ శూరుడు అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014-2019 మధ్య రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.