టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటితో పాటుగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
RGV: ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి.. సీఎంను క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు.
Hari Babu Kambhampati, Governor of Mizoram: విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లాట్కు సైతం గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
YSRCP In Municipal Elections 2021 Results: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ దిశగా వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్సీపీ రిపీట్ చేస్తోంది.
AP Municipal Election Results 2021 Live Update: ఏలూరు మినహా 11 నగరపాలక సంస్థలు, 72 పురపాలక, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
YS Jagan On YSRCP Formation Day: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఆయన శ్రమకు తగ్గ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.
Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Andhra Pradesh Municipal Elections 2021 Live Updates | బుధవారం ఉదయం ఏపీలో 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
AP Municipal Elections Latest News: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ఎలక్షన్ కమిషన్ కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ సర్వోన్నత న్యాయంస్థానం హైకోర్టు కొట్టివేసింది.
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇస్తూనే ప్రజల ఆరోగ్యం పట్టించుకోవాలని సూచించింది.
జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka)ను వైఎస్ జగన్ మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy).
కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వెంటాడుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA Chirla Jaggireddy Tests Positive For COVID) కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.