ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.
అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లన్నీ టీడీపీ నేత లోకేష్ సన్నిహితులు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు..మూడు వారాల్లోగా సమాధానం కోరింది. గతంలో ఇదే పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (AP Group-1 Mains Exam Postponed) ఊహించిటనట్లుగానే మరోసారి వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఏపీ గ్రూప్-1 నిర్వహించాల్సి ఉంది.
ఏ విషయమైనా సాంతంగా పరిశీలిస్తేనే అందులో తప్పొప్పులనేవి అర్ధమౌతాయి. అదే జరుగుతోంది ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్..ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు రాసిన లేఖ విషయంలో. మొదట్లో విమర్శలు వచ్చినా..ఇప్పుడందరూ జగన్ లేఖను సమర్ధిస్తున్నారు.
సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటీషన్ ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఓ పిటీషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిటీషన్ పై స్పందించింది. కమీషన్ లో చంద్రబాబుకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చిన పోస్టుల్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
భూ సేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని, గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు తాము ఇచ్చిన భూములకు న్యాయంగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్వర్ణప్యాలేస్ అగ్ని ప్రమాదం ఘటనపై డాక్టర్ రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని సమాధానమివ్వడం చర్చనీయాంశమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు..న్యాయవ్యవస్థకు ప్రఛ్ఛన్నయుద్ధం ప్రకటితమైపోయిందా.. పరిస్థితులు అదే స్పష్టం చేస్తున్నాయా..అసలేం జరుగుతోంది.. చట్టాల్ని చేసే అత్యున్నత వేదిక సాక్షిగా పోరాటం ఉధృతం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఇప్పుడు శాసనవ్యవస్థ వర్సెస్ న్యాయవ్యవస్థగా మారింది పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. పాలన చేస్తుంది ఎవరో తేల్చమన్న ఏజీ ప్రశ్నకు...హైకోర్టు స్పందించింది. తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ( YSRCP MLA Talari Venkat Rao ) కేసు నమోదైంది. ఆదిలక్ష్మి అనే మహిళ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా ద్వారకాతిరుమల పోలీసులను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత కొద్దికాలంగా రాష్ట్ర హైకోర్టు నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజ్యసభలో చర్చకొచ్చింది. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూ రాజ్యసభలో ప్రస్తావించారు ఎంపీ విజయసాయి రెడ్డి.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. రాజధాని ఒక్కటే ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని సాక్షాత్తూ హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మూడు రాజధానుల అంశాన్ని సుప్రీంకోర్టు ( Supreme court ) మరో బెంచ్ కు బదిలీ చేస్తూ విచారణ ప్రారంభించింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి వాదిస్తుండటంతో...కేసును మరో బెంచ్ కు బదిలీ చేశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.