మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో, సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే విధించడం ద్వారా ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 50 శాతానికి మించి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. మొత్తం రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
కొత్త ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త కొత్త హైకోర్టు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హజరయ్యారు
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ దాఖలు చేసి పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరుఫున వాదనలు విన్న ధర్మాసనం.... పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై నాలుగువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలవరం విషయం మోడీ సర్కార్ తాత్సారం చేస్తున్న నేపథ్యంలో కేవీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కేవీపీ పిటిషన్లో ఏముందంటే ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.