Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం సాధించన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపధ్యంలో నిలిచిపోయిన ఏలూరు కార్పొరేషన్ ఫలితం వెలువడేందుకు మార్గం సుగమమైంది.
AP High Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, వేతనమెంత వంటి వివరాలివీ.
CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
Mansas Lands Issue: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన మాన్సాస్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలో దిగి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్బంగా హైకోర్టు పలు విషయాలపై ఆరా తీసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఆటంకం కలిగింది. ఏపీ హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ప్రకారం రేపట్నించి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
MANSAS TRUST: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి.
AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కే రకం మందు వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..శాంపిల్స్ను స్టెరిలిటీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కే రకం కంటి మందు తప్ప మిగిలిన వాటికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
AP High Court: కృష్ణపట్నం కరోనా మందు వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్టుకు చేరింది. ఆనందయ్య మందు విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
Ambati Rambabu: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
AP Parishad Elections 2021 : ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదని హైకోర్టు పేర్కొంది.
AP High Court: కోవిడ్ బాధితుల చికిత్స విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. రోగులకు నిర్ధిష్ట సమాచార వ్యవస్థ అమలు చేయాలని కోరింది.
Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఉపశమనం లభించింది. ఎన్నిక రద్దు చేసి రీ పోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన వివిధ పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటీషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేసింది.
Eluru Corporation Result: ఏపీలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏలూరు ఫలితాలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.
AP Parishad Election 2021 Live Updates: మొత్తం 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేటి ఉదయం 7 గంటలకు ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు నేటి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
AP ZPTC And MPTC Elections | హై కోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Parishad Elections 2021 | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రస్తుతానికి ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
AP High Court : గతంలో విడుదలైన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ నూతన ఎస్ఈసీ ముందుకు వెళ్లడం, ఎన్నికలు కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, బీజేపీ మరియు జనసేన పార్టీలు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.