Heavy Rains in AP | రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. ఈ రోజుల్లో ఎంతో నిష్టతో ఉపావాసాలుంటూ.. దుర్గాదేవికి విశేష పూజలు చేస్తూ.. అమ్మవారి ప్రసన్నం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ అత్యంత భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇంద్రకీలాద్రీపై వెలసిన కనదుర్గమ్మ ఆలయాల్లో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
Indrakeeladri Landslide | తీవ్ర వాయుపీడన ప్రభావం కారణంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు రూ.50 లక్షల చొప్పున ( RS 50 Lakh To Vijayawada Swarna Palace victims family) ఏపీ మంత్రులు చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ( Swarna palace fire accident) ఘటన విషయంలో హీరో రామ్ వరుస ట్వీట్స్తో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసిన ఈ అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ( Viajayawada CP Srinivasulu ) పరోక్షంగా స్పందించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం (Fire Accident In Vijayawada) సంభవించింది. కోవిడ్19 కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.