ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో కాల్పులు జరిపి ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన ప్రధాన నిందితుడు వికాస్ దుబే ( Gangster Vikas Dubey) పై ఉన్న రివార్డును యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం భారీగా పెంచింది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బిక్రు గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది పోలీసులను అతి దారుణంగా హత్యచేసిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ( Gangster Vikas Dubey ) ఆచూకీ మూడు రోజులు గడిచినా లభించలేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. కార్మికుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడు (Ghaziabad Factory Explosion)లో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో నలుగురు కార్మికులకు కాలిన గాయాలయ్యాయి.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Bride dies in midst of wedding rituals | అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్ నడుమ ఇంటికి చేరుకోవాలనుకుంది. అంతలోనే విధి వక్రించింది. పెళ్లితంతు జరుగుతుండగానే వధువు చనిపోవడం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
poor father's ardeal: ఏ తండ్రి అయినా తన పిల్లలు కడపునిండితే తన కడుపు నిండినట్టే అని భావిస్తాడు. తనకు ఉన్నా లేకున్నా పిల్లలకు పెట్టి వారి ఆనందాన్ని చూసి సంతోషిస్తాడు. కానీ ఇక్కడ ఓ నిరుపేద తండ్రి ధీనగాథ మాత్రం అందుకు భిన్నమైనది. అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకును ( Father Tied Son With Chain ) గొలుసుతో కట్టేసిన పేద తండ్రి కథ ఇది.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
UP road accident ప్రతాప్ఘడ్ : ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్ఘడ్ జిల్లా వాజిద్పూర్లో ఓ కంటైనర్ ట్రక్కు మరో ఎస్యువి వాహనం ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీ కొన్న ఘటనలో 9 మంది చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ( Truck collided with SUV ).
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది. వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర పన్నుల్లో ( Central taxes ) మే నెల రాష్ట్రాల వాటాలను ( Tax shares of States) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ( Telangana share ) కేటాయించగా ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ. 1,892.64 కోట్లు ( Andhra Pradesh share ) మంజూరయ్యాయి.
ఉత్తర్ప్రదేశ్లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో వలస కూలీలు ఘటన, విశాఖలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరచిపోకముందే మరో ఘోరం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వలస కూలీలు దుర్మరణం చెందారు.
కరోనావైరస్ నివారణ కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు.
పాఠశాల అంటేనే చదువుల తల్లి సరస్వతి మాత నివాసం ఉండే దేవాలయంతో సమానం అని అంటారు పెద్దలు. కానీ ఓ ఊరిలోని గ్రామ పెద్దలు మాత్రం అదే పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించి పాఠశాలకు ఉండే పవిత్రను దెబ్బతీశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆ రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియాలంటే ఇదిగో ఈ స్మాల్ స్టోరీ చూడాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.