కరోనా చికిత్సకు సహకరించని ముస్లింలకు అదే శిక్ష విధించాలి: రాజా సింగ్

తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.

Last Updated : Apr 3, 2020, 06:49 PM IST
కరోనా చికిత్సకు సహకరించని ముస్లింలకు అదే శిక్ష విధించాలి: రాజా సింగ్

హైదరాబాద్: తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన ముస్లింలు వాళ్లకు తెలియకుండానే ఆ వైరస్‌ను వాళ్ల ఇంట్లో వాళ్లకు, ఇరుగుపొరుగు వారికి సోకేలా చేస్తున్నారని రాజా సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు.

కరోనా రోగులకు చికిత్స చేస్తోన్న వైద్యులు, నర్సుల పట్ల అశ్లీల వేషాలేసి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా కరోనావైరస్ వ్యాప్తికి కారకులవుతున్న కొంతమంది ముస్లింలకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఎందుకు బుద్ధి చెప్పడం లేదని రాజా సింగ్ నిలదీశారు. ఇలా చేయడం తప్పని అసదుద్దీన్ వారికి సూచించలేరా అని ప్రశ్నించారు. 

 Read also: ఏపీలో కరోనాతో తొలి మరణం.. ఆస్పత్రిలో చేరిన గంటలోనే కన్నుమూత

కరోనా వ్యాప్తికి కారకులవుతున్న వారు కుక్క చావు చచ్చేలా వారిని ఓ అడవిలోకి తీసుకెళ్లి ఓ షెడ్డులో విడిచిపెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదర, సోదరీమణులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వాళ్లే సొంతంగా వచ్చి వైద్యానికి సహకరించాల్సిందిగా రాజా సింగ్ కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News