తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి రెండో విడత రైతుబంధు పథకం ప్రారంభం కానుంది. రైతుబంధు సాయాన్ని భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది.
Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా ( new parliament building ) ప్రాజెక్టుకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) శంకుస్థాపన చేయన్నారు.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR On Corona Vaccine | కోవిడ్-19 టీకా పంపిణికి అంతా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. టీకా శాస్త్రీయంగా సిద్ధం అయితే దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల భారీ వరదలు పోటెత్తిన కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.
హైదరాబాద్ : రాష్ర్టంలోని సినిమా థియేటర్లు తెరిచేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే, కరోనావైరస్ నివారణ కోసం థియేటర్ల నిర్వహణలో థియేటర్ల యాజమామాన్యాలకు సర్కార్ పలు షరతులు విధించింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంతోపాటు భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని (LRS) సైతం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగస్తు 31న ఈ పథకాన్ని ప్రారంభించింది.
Certificates damaged in floods: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు ( Hyderabad rains and floods ) అనేక ప్రాంతాలను పూర్తి జలమయం చేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల్లో ఇండ్లు నీట మునిగిన చోట చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ( Study certificates ) సమస్య ఒకటి.
హైదరాబాద్: ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో స్పెషల్ పోలీస్ (TSSP) ఉద్యోగాలకు ఎంపికై అప్పటి నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు టిఎస్ఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో చేరడం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న 3,963 మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరదింపుతూ టిఎస్ఎస్పీ నుంచి అభ్యర్థులకు తీపి కబురు అందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.