తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
అన్లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.
హైదరాబాద్: అన్లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది. ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ( Hyderabad metro services ) పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ బస్సులకు కూడా రోడ్డెక్కేందుకు
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.
తెలంగాణ సర్కార్పై బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేపి నడ్డా మండిపడ్డారు.
Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో 1,284 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్ను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
IAS officials transfers: హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారిని అక్కడి నుంచి బదిలీ చేసి.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి (Telangana Govt) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు (Telangana High court) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
వాస్తు పేరుతో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM K. Chandrashekar Rao) పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సీఎం, సీఎస్లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.