Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
తాజాగా నమోదైన కోవిడ్19 పాజిటివ్ కేసులతో స్పెయిన్ దేశాన్ని భారత్ వెనక్కి నెట్టింది. స్పెయిన్లో 2.41లక్షల కేసులతో ఆరో స్థానానికి పడిపోగా, ప్రతిరోజూ అత్యధికంగా కరోనా కేసులు నమోదు చేస్తున్న భారత్ 5వ స్థానానికి ఎగబాకింది.
తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 51 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 37 కాగా వలసకూలీలు 14 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య మొత్తం 1,326కి చేరుకుంది.
ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులకు ( Coronavirus positive cases ) ఇంకా బ్రేకులు పడటం లేదు. శనివారం రాష్ట్రంలో కొత్తగా మరో 43 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా వైరస్కి కులం, మతం, ప్రాంతం, వర్ణం ఏదీ ఉండదనే యావత్ ప్రపంచం భావిస్తోంది.. దానినే నిజమని విశ్వసిస్తోంది. కానీ యూకే, యూఎస్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ శ్వేత జాతీయుల కంటే నల్ల జాతీయులకే కరోనా వైరస్ రిస్క్ అదనంగా ఉందని యూకే, యూఎస్లలో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో తేలింది.
తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 positive cases) నమోదయ్యాయి. ఈ 11 కరోనా కేసులు కూడా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 1,107 కు చేరుకుంది.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్లో అల్లకల్లోలం చేస్తోంది. దేశంలో ఓ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది.
ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనా ప్రభావం ఉండదని తొలి రోజుల్లో భావించిన మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 20వేలకు పైగా నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.