COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు చేయగా అందులో 3,660 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 574 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
Aerosols: కరోనా మహమ్మారి గాలి ద్వారా సంక్రమిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం మరికొన్ని కీలకాంశాల్ని వెల్లడించింది. ఏరోసోల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. 2 మీటర్ల దూరం సరిపోదిక..దో గజ్ దూరీ స్లోగన్ మార్చుకోవల్సిందే మరి.
Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని ఓదార్పుయాత్రలో పరామర్శించాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు వైఎస్ జగన్. బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందర్నీ హత్తుకున్నాయి.
Black Fungus Symptoms: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే..గోరుచుట్టుపై రోకలిపోటులా వచ్చి పడింది బ్లాక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్ ఫంగస్ను ఎలా గుర్తించాలి..ఏం చేయాలనేదానిపై సమగ్ర వివరణ ఇదీ..
US Covid Relief: కరోనా విపత్కర పరిస్థితులతో అల్లాడుతున్న భారదేశానికి ప్రపంచం యావత్తూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత, వైద్య సామగ్రిని విరివిగా అందిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా..ఇండియాకు అక్షరాలా చేసిన సహాయం విలువెంతో తెలుసా..
Telangana SSC Results: తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. పదవ తరగతి విద్యార్ధుల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. రేపు అధికారికంగా పదో తరగతి ఫలితాల్ని విడుదల చేయనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో విద్యార్ధులందర్నీ ప్రభుత్వం పాస్ చేసేసింది. ఇక గ్రేడ్స్ ఎలాగంటే..
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం, ప్రభుత్వం విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశంసించారు.
Black fungus cases in AP : అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారమే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉత్తర్వులు వెలువడినట్టు తెలుస్తోంది.
Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు.
Covid Third Wave: కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్నించి తేరుకోకముందే..థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంటోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు నుంచి అప్రమత్తమయ్యేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.
Lockdown Rules Break: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కఠినమైన లాక్డౌన్ లేదా కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్నాటకలో సైతం కఠినమైన లాక్డౌన్ అమల్లో ఉంది. కంచే చేను మేసినట్టు..సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడే లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
America: కరోనా మహమ్మారి సమయంలో అగ్రరాజ్యం ఇండియాకు అండగా నిలిచింది. కరోనా విపత్కర పరిస్థితుల వేళ భారత్కు సహాయం కొనసాగుతుందని..అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది.
Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్డౌన్ టైమింగ్స్లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు (AP govt) స్పష్టంచేసింది.
Telangana COVID-19 cases: హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Delhi Government: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని పిల్లలకు దూరం చేస్తే..మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్నించి తల్లిదండ్రుల్ని దూరం చేస్తోంది. అటువంటి అనాథ పిల్లల కోసం ఢిల్లీ ప్రభుత్వం చేయూత అందించేందుకు నిర్ణయించింది.
Ap Covid19 Update: కరోనా మహమ్మారి నియంత్రణకై పలు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న లాక్డౌన్, కర్ఫ్యూలు నెమ్మది నెమ్మదిగా ఫలితాలినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. మరోవైపు ఏపీలో భారీ ఎత్తున పరీక్షలు చేస్తున్నారు.
What happens if you get COVID-19 after taking the vaccine first dose ? కరోనావైరస్కు చెక్ పెట్టడానికే కొవిడ్-19 వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం. కానీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే అప్పుడేం చేయాలి ? కరోనా టీకా రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి ? ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే అసలు రెండో డోస్కి అర్హత అలాగే ఉన్నట్టేనా లేదా ?
The Lancet Report: కోవిడ్ రెండవదశ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాజా పరిశోధనలు అదే చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ జరిపిన అధ్యయనం వివరాలివి. తొలిదశలో మీరు చికిత్స ఎక్కడ తీసుకున్నారనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
Ap Government: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా బారినపడి పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయి. తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాధలవుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.