మయూరాసనం వేసిన సాగరకన్య

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి..  చేపకళ్ల సుందరిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సాహస వీరుడు సాగరకన్య సినిమాతో పొడుగుకాళ్ల సుందరిగానూ పేరు తెచ్చుకుంది. ఆనాటి నుంచి ఆమె సౌందర్యం.. ఇప్పటికీ తరగలేదు. దీనికి కారణం ప్రధానంగా ఆమె నిత్యం యోగా చేయడమే.

Last Updated : Jan 7, 2020, 02:44 PM IST
మయూరాసనం వేసిన సాగరకన్య

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి..  చేపకళ్ల సుందరిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సాహస వీరుడు సాగరకన్య సినిమాతో పొడుగుకాళ్ల సుందరిగానూ పేరు తెచ్చుకుంది. ఆనాటి నుంచి ఆమె సౌందర్యం.. ఇప్పటికీ తరగలేదు. దీనికి కారణం ప్రధానంగా ఆమె నిత్యం యోగా చేయడమే. ఇప్పుడు  కూడా ఆమె ఫిట్ నెస్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 

2020లో తొలి సోమవారాన్ని మండే మోషన్ గా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మయూరాసనం వేశారు. అంటే నెమలి ఆకృతిలో ఆసనం వేయడాన్నే మయూరాసనం అంటారు. రెండు చేతులపైనే మొత్తం శరీర బరువును మోయాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేయడం అంత సులభం కాదు. కానీ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి .. నిత్యం యోగాసనాలు అధ్యయనం చేస్తుంటారు కాబట్టి ఇది సాధ్యమైంది. స్వస్థ్ రహో .. మస్త్ రహో.. అంటున్న శిల్పాశెట్టి ఆసనాన్ని మీరూ చూడండి..

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News