Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
Cyclone Nisarga live updates నిసర్గ తుఫాన్ తీరాన్ని తాకింది. వాతావరణ శాఖ ( (IMD ) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 2.30 గంటల వరకు కొనసాగింది. అలీబాగ్కి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం ( Arabia sea ) అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి.
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
అప్పటివరకు తీవ్ర ఎండలు.. వేడెక్కన వాతారణం నగరంలో ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
దక్షిణ అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
నగర శివార్లలో సోమవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. రంగా రెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్మెట్ మండలం పరిసరాల్లో భారీ గాలి దుమారంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి కోహెడలో నిర్మించిన తాత్కాలిక ఫ్రూట్ మార్కెట్లోని రేకుల షెడ్లు అన్నీ నేలమట్టమయ్యాయి.
చిత్తూరు జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వెదురుకుప్పం, కుప్పం, రామకుప్పం, పెనుమారు, గుడిపల్లి, వీకోట, బైరెడ్డిపల్లి, ఐరాల, పుంగనూరు, పూతలపట్టు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా.. ఈ వర్షం ధాటికి పలు మండలాల్లో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం చేకూరినట్టు తెలుస్తోంది.
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.