సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
CM Jagan Review Meeting: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు సీఎం జగన్. వివిధ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
Union Govt On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్లో తాగు నీటి విభానికి సంబంధించి ఖర్చులను కూడా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, అదనంగా మరో 2 వేల కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Ex MLA JC Prabhakar Reddy: తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా.. వెనక్కి తగ్గేదేలే అన్నారు. ఆయన ఏం చెప్పారంటే..
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.
Chittoor Facebook Love: ఫేస్బుక్లో ద్వారా పరిచయమైన యువకుడిని ప్రేమించి.. శ్రీలంక దేశం నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చింది ఓ యువతి. వి.కోట మండలం ఆరిమాకులపల్లె గ్రామానికి యువకుడిని పెళ్లి చేసుకుని.. ఇక్కడే ఉంటోంది. వివరాలు ఇలా..
CM Jagan Review Meeting on Rains: పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయాలని చెప్పారు. కచ్చ ఇళ్లలో ఉన్న వారికి రూ.10 వేలు అందజేయాలని సూచించారు.
Student Unions Calls For Schools Colleges Bandh: నేడు స్కూల్స్, కాలేజీల బంద్కు పిలునిచ్చాయి టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
MP Avinash Reddy Letter to CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును పక్షపత ధోరణితో విచారణ జరిపారని లేఖలో ఆరోపించారు. లేఖ సారాంశం ఇది..
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
Minister Roja Coomments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. తన తల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసని అన్నారు.
Andhra Pradesh IPL Team: ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ తరుఫున ఫ్రాంచైజీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు అనుమతి ఇస్తే.. బిడ్ దాఖలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ హోమ్ గ్రౌండ్గా ఏపీ ఐపీఎల్ టీమ్ను రెడీ చేస్తున్నారు.
Eluru Crime News: ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరని తన ఇద్దరు కుమార్తెలను రెండో భర్తకు అప్పగించింది. వారితో పిల్లలను కనేలా భర్తను ఒప్పించింది. వినడానికే జుగుప్సాకరంగా ఉంది ఆ తల్లి ప్రవర్తన.
Ambati Rayudu On AP Volunteer System: రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
Janasena-TDP Alliance: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పటివరకు పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్.. తాజాగా ఇంకా సమయం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.