Chiranjeevi: డైలామాలో చిరంజీవి.. ‘విశ్వంభర’ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకే చేయని మెగాస్టార్.. ?

Chiranjeevi - Vishwambhara:  ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 12, 2024, 07:10 AM IST
Chiranjeevi: డైలామాలో చిరంజీవి.. ‘విశ్వంభర’ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకే చేయని మెగాస్టార్.. ?

Chiranjeevi - Vishwambhara: లాస్ట్ ఇయర్ ‘భోళా శంకర్’ మూవీతో బొక్క బోర్లా పడ్డ చిరంజీవి.. ఇకపై రీమేక్ ల జోలికి పోకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు ఎడాపెడా సినిమాలు ఓకే చేయకుండా.. తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నాడు. అందుకే ‘భోళా శంకర్’ తర్వాత చేద్దామనుకున్న సినిమాలను పక్కన పెట్టి.. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మూడు లోకాల చుట్టు తిరుగుతుందట. అందుకే ముందుగా  ఈ సినిమాకు .. ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ అనుకున్నారు. చివరకు ‘విశ్వంభర’ టైటిల్ పెట్టారు. అయితే.. చిరంజీవి.. ఒకప్పటిలా రీమేక్ అంటే.. మన ప్రేక్షకులకు తెలిసేది కాదు. ఏది కొద్ది మంది మాత్రమే తెలిసేది. ఇపుడు టెక్నాలజీతో పాటు ఓటీటీ వేదికలు పెరగడంతో అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది. 

ఏదైనా బడా స్టార్ హీరో చేస్తున్న సినిమా ఫలానా రీమేక్ అంటే ఆడియన్స్ కూడా నెట్ లో ఆ సినిమాను గూగుల్ చేసి మరి చూసేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఆయా హీరోలు సినిమాలు రీమేక్ చేసినా.. ఆయా మూవీలతో కంపారిజన్ చేస్తున్నారు. ఒకవేళ బాగా ఉంటే.. ఓకే కానీ.. తేడా కొడితే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

చిరంజీవి లాస్ట్ మూవీ ‘భోళా శంకర్’ విషయంలో అదే జరిగింది. నెటిజన్స్ ఈ సినిమాను నెట్టింట ఏకి పారేసారు. ఈ సినిమా .. తమిళంలో అజిత్ హీరోగా నటించిన  ‘వేదాళం’ సినిమాకు రీమేక్. దర్శకుడు మెహర్ రమేశ్ ఆ సినిమాను ఏ కోశానా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు.

మొత్తంగా  మెహర్ ను నమ్మిన చిరంజీవికి వెనకాల పెద్ద పిడిబాకే గుచ్చాడనే కామెంట్స్ వినిపించాయి. ఆల్రెడీ మెగాఫ్యాన్స్ మెహర్ రమేశ్ తో సినిమా అంటేనే భయపడ్డారు. చివరకు వాళ్లు ఏదైతే అనుకున్నారో.. అంతకు మించిందే జరిగింది. అయితే ‘భోళా శంకర్’ రీమేక్ విషయంలో .. ఆల్రెడీ ప్రూవ్ డ్ సబ్జెక్ట్ కాబట్టి మెగాస్టార్ రిస్క్ ఉండదని అనుకున్నారు. తీరా మొదటికే మోసం వస్తుందని ఫలితం వచ్చాకా కానీ తెలియలేదు.  దీంతో ‘భోళా శంకర్’ మూవీ తర్వాత చేద్దామనుకున్న ‘బ్రో డాడీ’ రీమేక్ చేద్దామనుకున్నాడు.  అంతా సెట్ అయిపోయింది. మరో వారం రోజుల్లో షూటింగ్ అనగానే ఈ ప్రాజెక్ట్ కు ప్యాకప్ చెప్పేసారు చిరంజీవి. వెంటనే ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు.

ఇక విశ్వంభర తర్వాత చిరు ఇమేజ్ కు తగ్గ స్టోరీలు రావడం లేదనే టాక్. మరోవైపు వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేద్దామంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో చిరంజీవి.. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఏ సినిమాను ఓకే చేయలేదు. ఒకే వేళ ఒప్పుకుంటే.. ఆ సినిమా కథ వేరే లెవల్లో ఉండాల్సిందే. ఇపుడుతున్న పరిస్థితుల్లో అలాంటి సూపర్ సబ్జెక్ట్స్ తో దర్శకులు చిరంజీవిని సంప్రదిస్తారా..అనేది డౌటే. ఒకవేళ దర్శకుల దగ్గర అలాంటి సబ్జెక్ట్స్ ఉంటే.. ముందుగా ఆయా దర్శకులు.. ఏ ప్రభాసూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, బన్ని వంటి హీరోలనే సంప్రదిస్తారు. వాళ్లందరినీ దాటుకొని అలాంటి కీలక సబ్జెక్ట్ మెగాస్టార్ వద్దకు రావాలి.   ఇలాంటి పరిస్థితుల్లో చిరు దగ్గరకు అద్భుతమైన సబ్జెక్ట్ రావడం అంటే మామలు విషయం కాదనే చెప్పాలి.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News