Chiranjeevi - Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో మరో ఇద్దరు క్రేజీ భామలు..

Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ తర్వాత తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే చిరు సరసన త్రిష యాక్ట్ చేస్తోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2024, 08:36 AM IST
Chiranjeevi - Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో మరో ఇద్దరు క్రేజీ భామలు..

Chiranjeevi - Vishwambhara:  చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఏజ్ పెరిగే కొద్ది చిన్న పిల్లాడు అయిపోతున్నాడు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు చిరు. ఈ మూవీని 2025 జనవరి 10న సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ముందే ప్రకటించి సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఓ వైపు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్స్ కోసం కసరత్తు చేస్తూ రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పటికే విడుదలైన 'విశ్వంభర' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు When MYTHS Collides Legends Rise అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎపుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అపుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్ధంలో కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. ముందుగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఇషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో వీళ్లిద్దరు జాయిన్ అయ్యారు. ఇందులో అప్సరస క్యారెక్టర్స్ చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కావడం విశేషం. ఈ మూవీలో చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు తమిళంలో శింబుతో తమిళంలో ఈ సినిమాకు మంచి మార్కెట్ దొరికే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ $4 మిలియన్ యూఎస్ డాలర్స్‌కు అమ్ముడు పోయినట్టు సమాచారం. చిరంజీవి గత సినిమాలేవి 1 మిలియన్ డాలర్ మించి కలెక్ట్ చేయలేదు. ఇలాంటి సమయంలో సబ్జెక్ట్ పై నమ్మకంతో పాటు సంక్రాంతి సీజన్ కలిసొస్తుందనే నమ్మకంతో బయ్యర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరుతో ఈ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Also Read: HCA BMW Offer: హైదరాబాద్‌ క్రికెటర్లకు బంపరాఫర్‌.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News