అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసిన వైవి సుబ్బా రెడ్డి

అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసిన వైవి సుబ్బా రెడ్డి

Last Updated : Aug 2, 2019, 08:05 PM IST
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసిన వైవి సుబ్బా రెడ్డి

న్యూఢిల్లీ: టీటీడీ చైర్మన్ హోదాలో తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన వైవి సుబ్బా రెడ్డి అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు శ్రీవారి ప్రసాదాలను అందజేసిన వైవి సుబ్బారెడ్డి.. ఏపీ అభివృద్ధికి సహకరించాల్సిందిగా వారిని కోరారు. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా నెరవేర్చడంతోపాటు ఏపీకి ఇతోధికంగా నిధులు అందించి రాష్ట్రాభివృద్ధికి సహాయపడాల్సిందిగా వైవి సుబ్బారెడ్డి వారికి విజ్ఞప్తిచేశారు.

Trending News