AP Corona cases: ఏపీలో తగ్గిన స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి- కొత్తగా ఎన్ని కేసులంటే..

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరణాల సంఖ్య పెరిగింది. క్రితం రోజుతో పోలిస్తే రికవరీలు కూడా పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 11:14 PM IST
  • రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
  • క్రితం రోజుతో పోలిస్తే పెరిగిన మరణాలు
  • రికవరీల్లోనూ భారీ వృద్ధి నమోదు
AP Corona cases: ఏపీలో తగ్గిన స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి- కొత్తగా ఎన్ని కేసులంటే..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12,926 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 43,763 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం. క్రితం రోజుతో పోలిస్తే శాంపిళ్లు స్వల్పంగా తగ్గాయి.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,913 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,78,513 మంది కరోనాను జయించారు.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,538 మంది కొవిడ్​కు బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 73,143 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 14,292 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత చిత్తూరులో 10,973 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 1,505 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో మూడు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,21,00,381 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,166,194  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

Also read: Volunteers Insurance: సొంత ఖర్చుతో వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన ఎమ్మెల్యే రాజా

Also read: Corona in AP: ఏపీలో కొవిడ్ కల్లోలం- ఒకే స్కూల్లో 147 మందికి పాజిటివ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News