Telangana: మరో ఎమ్మెల్యేకు కరోనా..

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ( Coronavirus ) విచ్చలవిడిగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కరో్నా బారిన పడుతున్నారు.

Last Updated : Aug 8, 2020, 01:24 PM IST
Telangana: మరో ఎమ్మెల్యేకు కరోనా..

MLA devireddy sudheer reddy: హైదరాబాద్‌: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ( Coronavirus ) విచ్చలవిడిగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కరో్నా బారిన పడుతున్నారు. రాష్ర్టంలో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రికి కరోనా సోకింది. అయితే.. పలువురు కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా కొంతమంది చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే తాజాగా అధికారపార్టీ టీఆర్ఎస్ ఎల్‌బీనగర్‌ (LB Nagar) నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (devireddy sudheer reddy) కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. Also read: India: 20లక్షలు దాటిన కరోనా కేసులు

సుధీర్‌ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి ఇద్దరు కుమారులతోపాటు.. వంటమనిషికి కూడా కరోనా పరీక్షలు చేశారు. దీంతో వారందరికీ కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ప్రస్తుతం వారంతా వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  Also read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

Trending News