తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందిన ఘటన మరువకముందే తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Last Updated : Jun 25, 2018, 09:11 AM IST
తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందిన ఘటన మరువకముందే తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి వద్ద ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అటో, కారు ఢీకొని నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఇంబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతులు మృతులను చెన్నారెడ్డి గూడెంకు చెందిన వారిగా గుర్తించగా.. ఆటోలో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరోవైపు.. యాదాద్రి భివనగిరి జిల్లా వేములకొండలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకోగా.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూం ఇల్లు, అంత్యక్రియలకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు అదనంగా మరో రూ. లక్ష ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Trending News