Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్తో టచ్లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్లో ఆయన ప్రసంగం చేశారు.
Telangana Success in Davos: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తడాఖా చూపించింది. దావోస్లో జరిగిన సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు రాగా.. రెండో రోజు కూడా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తరలివచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైంది. స్విట్జర్లాండ్ నుంచి తెలంగాణ రూ.40,232 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం విశేషం.
Telangana Investments: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. సదస్సు ప్రారంభం నాడే రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు అదానీ, గోద్రెజ్, జేఎస్డబ్ల్యూ, గోడి, వెబ్ వర్క్స్, ఆరాజెన్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Metro Rail Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండింటికి శ్రీకారం చుట్టిన రేవంత్ విధానపర నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.