Hyderabad Metro Super Saver Card Offer. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సెలవు రోజుల్లో ఉపయోగించుకునేలా 'సూపర్ సేవర్' కార్డును హైదరాబాద్ మెట్రో అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Bus falls into gorge near Tirupati: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
TS RTC announces bus points : బస్సు పాయింట్స్ను ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ. సంక్రాంతి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్ధం బస్సు పాయింట్స్ ఏర్పాటు చేసింది.
Goa port: ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్ నౌకలో కరోనా కలకలం రేగింది. ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో...దాదాపు 2వేల మంది ప్రయాణికులు గోవా తీరంలో చిక్కుకుపోయారు.
ఒమిక్రాన్ వ్యాప్తి దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లో కరోనా టెస్ట్ తప్పనిసరి చేశారు. దీంతో టెస్ట్ ఫలితాలు వచ్చేవరకు ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఢిల్లీ ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ను తలపిస్తోంది.
ట్రైన్లో సీటు కోసం తాను కూర్చున్న బోగీ అంతా వెతికిన ఓ యువకుడికి సీటు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఉన్న బోగీలోనే కాకుండా.. ట్రెయిన్లోని ఇతర బోగీలు సైతం వెతికాడు. ఫలితం లేకపోయింది. దూర ప్రయాణం చేయాల్సి వస్తే రైలులో సీటు (Train seats) లేకుండా ప్రయాణం చేయడం చాలా అంటే చాలా చాలా కష్టం.
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.
Kabul Airport: కాబూల్ సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోయాయి. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే దిక్కు. జనాలతో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది.
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు ( TSRTC buses ) గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ( TSRTC buses exepmted from curfew ) ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) స్పష్టంచేశారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చే బస్సులు జేబిఎస్తో పాటు ( JBS ), ఇమ్లీవన్ వరకు ( MGBS ) వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దాదాపు 2 నెలల లాక్డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.
కరోనాను (Coronavirus) పారదోలేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Lockdown in India) విధించడంతో వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉండటం ఇష్టంలేని వాళ్లు సొంతుళ్లకు వెళ్లే ప్రయత్నం చేసి పోలీసుల చేతిలో భంగపాటుకు గురై వెనుతిరిగొస్తున్న సంగతి తెలిసిందే.
విమానం టేకాఫ్ అవుతుందనడానికి కొన్ని నిమిషాల ముందు ఉన్నట్టుండి ఓ పక్షి ఎగిరొచ్చి విమానంలోకి ప్రవేశించింది. గోల్ కొట్టినట్టుగా సరిగ్గా వచ్చి విమానంలోకి అయితే దూరింది కానీ.. అందులోంచి తిరిగి ఎలా బయటపడాలో అర్థం కాక అందులోనే చక్కర్లు కొట్టసాగింది. అయోమయంలో పడిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తుండిపోగా... ఇంకొంతమంది పోతే రాదు ఈ దృశ్యం అన్నట్టుగా తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ బిజీ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో.. వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం ప్రపంచదేశాలన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.