భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నమస్తే ట్రంప్ వేదికపై మైక్ అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కన ప్రసంగం ఆరంభంలోనే మోదీకి తనదైన స్టైల్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీని ఛాంపియన్గా, అమెరికాకు, తనకు నిజమైన స్నేహితుడిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్.. తనను భారత్కి ఆహ్వానించి ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 'నమస్తే ట్రంప్' వేదికపైకి స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చారు. అంతకంటే ముందుగా నమస్తే ఈవెంట్కి హాజరైన వారిని ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ ఉపన్యాసం తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రసంగిస్తానని అన్నారు.
వీడియో: ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైన ప్రధాని మోదీ- డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో, ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది.
అహ్మెదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అహ్మెదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. ట్రంప్ సతీమణి మెళానియా ట్రంప్కు చేయి చాయి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత గడ్డపైకి స్వాగతించారు. అనంతరం విమానాశ్రయంలో ఆయన రాకకోసం వేచిచూస్తున్న భారత ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోదీ ఆయనకు పరిచయం చేస్తూ వెళ్లారు. అక్కడి నుంచి ట్రంప్ తన బీస్ట్ కారు ఎక్కి కూర్చోగా.. ప్రధాని మోదీ తన కాన్వాయ్లో రోడ్ షోగా బయల్దేరారు.
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఫిబ్రవరి 24, 25 తేదీలలో రెండ్రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి భారత్లో పర్యటించనున్నారు. భారత్లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుస్తున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ..డ్రీమ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం 'ది స్టాచ్యూ ఆఫ్ యునిటీ'ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మరో డ్రీమ్ ప్రాజెక్టు రెడీ అయింది.
ఫిబ్రవరి 16న ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి లోక్సభ నియోజకవర్గంలో ఒకరోజు పర్యటనలో బాగంగా పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన భారతీయ జనతా పార్టీపై, శివసేన ఘాటైన విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదని, అమిత్ షా వ్యూహరచన విఫలమైందని మండిపడింది.
దశాబ్దాల కాలం నాటి రామ్ జన్మభూమి అంశం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పం, పట్టుదలను సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెనర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.