బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్ను నిర్వహించారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లు అయన్ను ఒక గ్లోబల్ లీడర్ గా అభివర్ణించాయి. అనేక దేశాలను పర్యటించిన మోదీ విదేశాంగ విధానాన్ని బలపరిచారు. అదే విధంగా తన నాయకత్వ పటిమ, మాటలతో ఆయన కోట్లాది మందికి ఫేవరిట్ లీడర్ గా ఎదిగారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన యువతికి న్యాయం చేయాలంటూ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ మేరకు ప్రజలతోపాటు.. విపక్షాలు యూపీ యోగి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు హత్రాస్లో పర్యటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
మహాత్మాగాంధీ 151వ జయంతి (Mahatma Gandhi Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), తదితర నేతలు ఘనంగా నివాళి అర్పించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు.
బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస (Jaswant Singh Passes Away) విడిచారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (Jaswant Singh Dies) మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంతాపం ప్రకటించారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.