టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ గాయపడ్డాడు. కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ కొట్టిన స్వీప్ షాట్.. గిల్ ముంజేయికి తగిలింది. దాంతో అతడు మైదానంలోనే నొప్పితో విలవిలలాడాడు.
న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు జిమ్ లేకర్, మరియు అనిల్ కుంబ్లేలు మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టారు.
ముంబై వేదికగా భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (120 నాటౌట్; 246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ చేశాడు.
చాలా రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అంపైర్ తప్పిదం వల్ల ఔట్ కావడంతో ఎంతో నిరాశగా మైదానం నుంచి డగౌట్కు బయలుదేరాడు. ఈ క్రమంలో బౌండరీ దగ్గరకు రాగానే ఆవేశంతో తన బ్యాట్ను బౌండరీ రోప్కు కొట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో వాంఖడే మైదానంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు మొదటి సెషన్ కోల్పోవాల్సి వచ్చింది. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.
రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు రెండో టెస్టు ఆడడం లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ ముగ్గురికి గాయాలవడమే అందుకు కారణం.
చివరి రోజు కాన్పూర్ పిచ్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా భారత బౌలర్లు 8 వికెట్లు తీశారని రాహుల్ ద్రవిడ్ ప్రశంసించారు. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్ భారత్ సొంతమయ్యేదన్నారు.
కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి సెషన్లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఓ రికార్డు నెలకొల్పాడు. ఐదో రోజు ఆటలో కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు.
ముంబై టెస్టులో అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్లలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే అది కష్టమైన నిర్ణయమని భారత మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీనే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నాడు.
IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన కేఎస్ భరత్.. వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానేను ఒప్పించి మరీ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు.
Gutkha Man: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో గుట్కా నములుతూ కనిపించిన శోభిత్ పాండే అనే వ్యక్తిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిజానికి ఆ సమయంలో తాను గుట్కా తినలేదని తాజాగా అతను మీడియా ముందుకొచ్చాడు.
కాన్పూర్ టెస్టులో అరంగేట్రం చేసిన తర్వాత శ్రేయాస్ టెస్ట్ క్రికెట్ ఆడాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వల్లే క్రికెట్ ఆడుతున్నానని శ్రేయాస్ చెప్పాడు.
ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిల్యాండ్ 57 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ స్కోరుకు కివీస్ 216 పరుగులు వెనకబడి ఉంది.
కాన్పూర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా శ్రేయాస్ రికార్డల్లో నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్పై అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్గా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు.
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
KL Rahul Ruled Out: న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు టీమ్ఇండియాకు (India Vs New Zealand Test Series) షాక్ తగిలింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా (KL Rahul Injury) టెస్టు సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు.
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో ఇష్ సోధి రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన తీరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ క్యాచ్ కు రోహిత్ శర్మ కూడా ఎలా ఆశ్చర్యపోయాడో మీరే చూడండి..
IND Vs NZ 3rd T20 2021: కలకత్తా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో 73 పరుగులు తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.