Cyclone Alert: ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుపాను హెచ్చరిక జారీ అవుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Cracks in houses in Tirupati: తిరుపతి వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Ys Jagan Letter On Flood Aid: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడింది. ఆస్థినష్టం, ప్రాణనష్టం భారీగా సంభవించింది. వరద సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు ట్రాక్ల మరమ్మతు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హిందూపురం కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం అధికంగా అందటం.. బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళటం.. బస్సు చిక్కుకొని పోవటం.. స్థానికులు బస్సలో ఉన్నవారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది
Highway damaged in Nellore: పెన్నా నదికి భారీ వరద పోటెత్తుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో దామరమడుగు వద్ద 16వ నంబర్ హైవే కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Ap Heavy Rains Effect: ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి. భారీ వర్షాలతో మృతుల సంఖ్య 24కు చేరుకుంది.
Papagni river bridge collapsed: కడప జిల్లా కమలాపురంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి భారీ వరదలకు కుప్పకూలింది. వరద ప్రవాహానికి పిల్లర్లు కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Kadapa district flash flood..12 bodies recovered: దాదాపు 30 మంది పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభించాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూవీ ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి.
Ten People Trapped In Chitravathi River :జేసీబీపై (JCB) 8 మంది దాకా చిక్కుకున్నారు. వారంతా ఉదయం నుంచీ చిగురుటాకుల్లా వణుకుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వరద (Floods) ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు వీలు కావడం లేదు.
భారీ వర్షాలకు కడప జిల్లా అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెయ్యేరు నదికి వరద నీరు పోటెత్తటంతో..30 మంది గల్లంతు అయ్యినట్లు సమాచారం.
Heavy rains: భారీ వర్షాలకు తిరుమల నీట మునిగింది. ఆలయ పరిసరాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకల నిలిపివేశారు. భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు.
Heavy Rain Alert: Telangana districts to be hit owing to depression in Bay of Bengal : అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.