మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు.
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
లాక్డౌన్ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
ఒకే బిల్డింగ్లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని కపాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్కి చెందిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్డౌన్ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్డౌన్ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
మే 3తో ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
కరోనావైరస్ పుట్టుకపై అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ మనిషి సృష్టించిందేనని, చైనాలోని వుహాన్ ల్యాబ్లో ప్రమాదవశాత్తుగా అది బయటపడిందని వస్తోన్న కథనాలను అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరుకుంది.
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.