SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. హైకోర్టు తీర్పు పై ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది
Kodi Kathi Case: ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసులో నిందితుడి ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
CJI NV Ramana about Supreme Court judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకం కోసం ముగ్గురు మహిళా జడ్జిలతో కలిపి మొత్తం 9 మంది జడ్జిల పేర్లతో సీజేఐ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజీయం (Supreme Court collegium) ఓ జాబితాను సిద్ధం చేసి, కేంద్రానికి సిఫార్సు చేసినట్టుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం-2019పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణపై సుప్రీం కోర్టు స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ కాలం గడుస్తున్నందున.. అక్టోబర్ 3 2018 తేది నుండి గొగోయ్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై ఇచ్చిన నోటీసును రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తంచేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న వెంకయ్యనాయుడు నోటీసును తిరస్కరించారు. సీజేఐపై అభియోగాలు పేర్కొంటూ కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం విదితమే.న్యాయ నిపుణుల సలహా మేరకే వెంకయ్య నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ లా ఆఫీసర్ కే పరసరన్ లతో ఉపరాష్ట్రపతి సమావేశం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.