PM Modi: యూపీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య ఘటన...బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ..!

PM Modi: యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 01:21 PM IST
PM Modi: యూపీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య ఘటన...బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ..!

Uttar Pradesh Election Campaign 2022: యూపీలో రాజకీయపార్టీల తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మురం చేశాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ప‌లు ద‌శల‌ ఎన్నిక‌లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచారంలో (up polls 2022) ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి (PM Modi) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

వివరాల్లోకి వెళితే...
ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్‌ కతియార్‌ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం అవదేశ్‌ (awadhesh katiyar) ప్రధాని పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. మోదీ వెంటనే ఆయనను ఆపారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్‌ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు ప్రధాని మోదీ. దేశ ప్ర‌ధాని ఇలా ఈ చిన్న నేత కాళ్లు మొక్క‌డం.. మోదీ గొప్పతనానికి నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Fodder scam Case: దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News