Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Kangana Ranaut: దేశానికి స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 08:18 AM IST
  • దేశ స్వాతంత్ర్యంపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఖండించిన రాజకీయ, సినీ ప్రముఖులు
  • దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్​
Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

India got freedom in 2014 says Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం (Kangana Controversy) వచ్చింది 1947లో కాదని.. అది భిక్ష మాత్రమే అన్నారు. 2014లోనే (మోదీ మొదటిసారి ప్రధాన మంత్రిగా గెలిచిన ఏడాది) దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని (Kangana on India Freedom) అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

దీనితో ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చేలరేగింది. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ (MP Varun Gandhi on Kangana)​ గాంధీ సహా ఇతర పార్టీల నేతలు ప్రముఖులకు మండి పడ్డపారు.

కంగన క్షమాపణలు చెప్పాలి..

దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ అన్నారు. ఇటీవల కంగనకు ఇచ్చిన పద్మ అవార్డును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.

Also read: Man kiled by wife's boyfriend : ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో భర్తను చంపింది

దీన్ని దేశ ద్రోహమనాలా.. పిచ్చి అనాలా..

మరోవైపు బీజేపీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగనా రనౌత్​ మాటలను తీవ్రంగా తప్పబట్టారు. ఆమె మాటలను దేశద్రోహంగా బావించాలా? పిచ్చిపట్టి మాట్లాడుతోందని భావించాలా? అని ట్విట్టర్​ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను కేవలం ఖండిస్తే సరిపోదన్నారు.

వరుణ్ గాంధీ ట్వీట్​పై ఇన్​స్టాలో స్పందించారు కంగనా. ఆయన ట్వీట్​ను జోడిస్తూ.. '1857 తిరుగుబాటు తొలి స్వాతంత్య్ర పోరాటం. దాన్ని అణచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత వారు గాంధీ ముష్టిపాత్రలో మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. ఇక వెళ్లి మరింత ఏడవండి’’ అని సమాధానమిచ్చారు.

Also read: Forced marriage : ప్రేమికులను బంధించి పెళ్లి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు

Also read: Kidnap Drama: గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా బుక్కైన యువకుడు

ఇటువంటి వ్యాఖ్యలు చేసిన కంగనాపై దేశ ద్రోహం కేసు పెట్టాలని, దీనిపై ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీర నేత ప్రీతి శర్మ తెలిపారు.

కంగనా రనౌన్​ ఓ కార్యక్రమలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల అనంతరం అందులో ఉన్న కొంత మంది చప్పట్లు కూడా కొట్టారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ.. కంగా వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టన మూర్ఖులెవరో తెలుసుకోవాలి అంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ నటి స్వర భాస్కర్​

సినీ నిర్మాత ఓనిర్​.. 'అయితే మనం ఇప్పుడు కొత్త స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామా?' అంటూ ప్రశ్నించారు.

Also read: Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు

Also read: Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం- మరోసారి ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News