Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు

Corona cases in India: దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. ఒక్క రోజులో 22,700లకుపైగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 10:05 AM IST
  • దేశంలో మరోసారి కరోనా విజృంభణ
  • ఒక్క రోజులో 22,700 పైకి కొత్త కేసులు
  • కొవిడ్​ మరణాల్లోనూ భారీ వృద్ధి
Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు

India corona Update: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,775 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. మొత్తం 11,10,855 మందికి కొవిడ్ టెస్టులు చేయగా ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది.

కరోనా మరణాలు కూడా భారీగా పెరిగాయి. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 406 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,949 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

తాజా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం (Omicron cases in India) 1,431 ఒమిక్రాన్​ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,04,781 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.30 శాతానికి పెరిగింది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,81,486 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,861,579 మందికి కరోనా సోకగా.. అందులో  34,275,312 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.32 శాతానికి తగ్గింది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 58,11,487 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య '1,45,16,24,150'కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 288,519,264 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,452,937 మంది మహమ్మారికి బలయ్యారు. 253,688,440 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 29,377,887 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Vaishno Devi Stampede : కొత్త సంవత్సరం వేళ విషాదం.. వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట, 12 మంది భక్తులు మృతి..

Also read: PM Kisan 10th Installment: కేంద్రం గుడ్​ న్యూస్​- పీఎం కిసాన్​ నిధుల విడుదల నేడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News