AP Government: ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ అంటే పవన్‌కు అంత భయమెందుకు

AP Government: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై వివాదం పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే అంత భయమెందుకని మంత్రులు అనిల్ యాదవ్, బొత్సలు ప్రశ్నిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2021, 02:27 PM IST
  • పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు అనిల్ యాదవ్, బొత్స సత్యనారాయణ
  • ఆన్‌లైన్ పోర్టల్ అంటే పవన్‌కు అంత భయమెందుకని ప్రశ్నించిన మంత్రి అనిల్ యాదవ్
  • డిస్ట్రిబ్యూటర్లకు లేని భాద పవన్‌కు ఎందుకని నిలదీసిన మంత్రి బొత్స
AP Government: ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ అంటే పవన్‌కు అంత భయమెందుకు

AP Government: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై వివాదం పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే అంత భయమెందుకని మంత్రులు అనిల్ యాదవ్, బొత్సలు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో థియేటర్ టికెట్లను ఆన్‌లైన్‌లో(Online Tickets Issue)విక్రయించే విధానానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ విధానంపై ఇప్పుడు వివాదం ముదురుతోంది. సాయిథరమ్ తేజ్(Saidharam Tej) మూవీ రిపబ్లిక్ ఆడియా రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్‌పై విమర్శలు గుప్పించగా..తాజాగా మంత్రులు అనిల్ యాదవ్, బొత్స సత్యనారాయణలు విమర్శలు ఎక్కుపెట్టారు. 

ఆన్‌లైన్ టికెట్ పోర్టల్(Online Ticket Portal) గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌కు వచ్చిన నష్టమేంటని..ఆన్‌లైన్ పోర్టల్ అంటే అంత భయమెందుకని మంత్రి అనిల్ యాదవ్ ప్రశ్నించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాపత్రయ పడుతున్నాడని మండిపడ్డారు. తన ఒక్కడి కోసం చిత్రపరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనడం సరికాదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని మంత్రి అనిల్ యాదవ్ (Anil Yadav)స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టడం..పవన్ కళ్యాణ్‌కు ఓ ఫ్యాషన్‌గా మారిందన్నారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్ అని..అందరికీ టికెట్ ధరలు ఒకేలా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. 

మరోవైపు ఇదే విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)స్పందించారు. సినిమా టికెట్ల ధరల్ని ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి బొత్స పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందన్నారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లే అడిగారని స్పష్టం చేశారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లేని బాధ పవన్ కళ్యాణ్‌కు ఎందుకని ప్రశ్నించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. 

Also read: Online Tickets Issue: ఆన్‌లైన్ టికెట్లతో నీకు వచ్చిన నష్టమేంటని మండిపడ్డ మంత్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News