నందమూరి సుహాసిని విషయంలో చంద్రబాబు డ్రామా ఇదే -కేటీఆర్

తెలంగాణ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న విమర్శలకు కేటీఆర్ ఎదురుదాడి ప్రారంభించారు.

Last Updated : Nov 29, 2018, 08:35 PM IST
నందమూరి సుహాసిని విషయంలో చంద్రబాబు డ్రామా ఇదే -కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. నందమూరి సుహాసినిని అభ్యర్ధిత్వాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఎన్టీఆర్ కుటుంబంపై ఆయన చూపిస్తోంది కపట ప్రేమ అని ఎద్దేవ చేశారు. అసలు నిజంగా నందమూరి కుటుంబం మీద ఆయనకు అంత ప్రేమ ఉంటే.. నారా లోకేశ్ ను ఏపీలో మంత్రిని చేసినట్టుగా అక్కడే ఆమెను మంత్రిని చేసే వారని సైటర్లు వేశారు. సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కాకుండా ఇటీవల జరిగిన ఏపి మంత్రి వర్గ విస్తరణలో స్థానం ఎందుకు కల్పించలేదని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు.

బరిలోకి లోకేష్ ను దించవచ్చు కదా..?
 తెలంగాణలో టీడీపీని కాపాడుకోవాలంటే  ఎన్నికల బరిలోకి లోకేశ్ ను దింపొచ్చు కదా అన్ని ప్రశ్నించారు. ఇది ఓడిపోయే సీటు అని చంద్రబాబుకు ముందే తెలుసు అని..సుహాసిని బలిపశువును చేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

 పాపం! ఆమెకు రాజకీయాల తెలియవు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుహాసినిపై పెద్దగా విమర్శలు చేయనప్పటికీ ఆమెను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించారు.  నందమూరి సుహాసిని గురించి కేటీఆర్ మాట్లాడుతూ .. పాపం!  రాజకీయాలు తెలియని నందమూరి సుహాసినిని ఇక్కడ నిలబెట్టారు! అని ఎద్దేవ చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినిని బరిలోకి దిగుతున్న విషయం ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. చంద్రబాబు తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో కేటీఆర్ ఈ రకంగా విమర్శల దాడి చేయడం గమనార్హం. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న విమర్శలకు  ఇలా ఎదురుదాడి ప్రారంభించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Trending News