భారీగా పట్టుబడిన బంగారం

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Last Updated : Feb 9, 2020, 11:26 PM IST
భారీగా పట్టుబడిన బంగారం

హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.

పడ్డుబడిన బంగారం విలువ 1 కోటి రూపాయల పైచిలుకు ఉంటుందని, అరెస్టు చేసిన వారిని పోలీసుల కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళలను విచారించిన తరవాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని కస్టమ్స్ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News